అమెరికా పోలీసు ఎన్‌కౌంటర్‌లో భారతీయుడికి గాయాలు

ఇంటర్నెట్‌డెస్క్‌, హైదరాబాద్‌: పర్యటన నిమిత్తం అమెరికా వెళ్లిన ఓ భారతీయుడు అక్కడి పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో గాయపడ్డారు. ఓ వ్యక్తి అనుమానాస్పదంగా సంచరిస్తున్నాడని వచ్చిన సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని అతనిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సురేష్‌భాయ్‌ పటేల్‌(57) తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సురేష్‌భాయ్‌ పటేల్‌పై అకారణంగా కాల్పులు జరిపిన సంఘటనపై కోర్టులో కేసు వేయాలని అమెరికాలో స్థిరపడిన అతని బంధువులు యోచిస్తున్నారు.