అరుట్ల గ్రామంలో బోనాల పండుగ ఉత్సవాలలో పాల్గొన్న మాదగోని జంగయ్య గౌడ్

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):- మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో పోచమ్మ బోనాల పండుగ సందర్భంగా  గౌడ.సంఘం ఆధ్వర్యంలో జరిగిన బోనాల పండుగ ఉత్సాహలో పాల్గొన్న వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర నాయకుడు మాదగోని జంగయ్య గౌడ్ అనంతరం.గౌడ సంఘం పెద్దలు గ్రామ సర్పంచ్ కొంగర విష్ణు వర్ధన్ రెడ్డి తో కలిసి కంఠ మహేశ్వర దేవాలయం లో ప్రజలందరు సుఖ సంతోషాలతో జీవించాలని ప్రత్యేక పూజలు చేసారు ఈ కార్యక్రమంలో
గౌడ సంఘం సీనియర్ నాయకులు పాండాల యాదయ్య ,మాడుగుల బుచ్చయ్య ,గౌడ సంఘం అధ్యక్షుడు
తంగడి పల్లి నరేందర్ , ఉపాధ్యక్షుడు సుంకరి ప్రవీణ్ ,పాండాల యాదయ్య ,దూసరి రమేష్ , మద్దెల రాజు ,అంతటి రాజు ,సుంకరి బాలరాజు ,మాడుగుల రాజు ,చిందం జంగయ్య, తదితరులు పాల్గొన్నారు