అసెంబ్లీ సమావేశాలకు ముందే స్థానిక ఎన్నికల నోటిఫికేషన్: ఆనం
హైదరాబాద్ : స్థానిక సంస్థల నోటిఫికేషన్ అసెంబ్లీ సమావేశాలకన్నా ముందే వెలువడే అవకాశముందని మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి అన్నారు. జూన్ నెలాఖరుకల్లా స్థానిక సంస్థలు మున్సిపల్, పంచాయతీ ఎన్నికలు పూర్తవుతాయని అయన చెప్పారు. మంత్రి డీఎల్ బర్తరఫ్ ప్రభావం పార్టీపై ఉండదని, సీఎం సూచనలమేరకే డీఎల్ను బర్తరఫ్ చేయడం జరిగిందని మంత్రి అన్నారు.