అసోం వరదలు: 121కి చేరిన మృతుల సంఖ్య

గౌహతి: అసోం ప్రజల వరద కష్టాలు ఇంకా తీరలేదు. ఇంకో 16గురి ఆచూకీ లభించలేదు. బ్రహ్మపుత్ర, దాని ఉపనదుల నీటి మట్టం ప్రమాదస్థాయినుంచి నిదానంగా తగ్గుతోంది కానీ గ్రామాల్లో చేరిన వరదనీరు మాంరతం ఇంకా అలాగే ఉంది. 27 జిల్లాల్లో దాదాపు 22 లక్షల మంది ప్రజలు ఈ వరదల వల్ల తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ప్రపంచంలోనే నది మధ్య ఉన్న ద్వీపంగా ప్రఖ్యాతి గాంచిన మజూలి (బ్రహ్మపుత్ర నది మధ్య ఉన్న ద్వీపమిది.) ఇప్పటికీ పూర్తిగా నీటమునిగి ఉంది. అక్కడ నివసించే 75 కుటుంబాలవారు నిరాశ్రయులయ్యారు.