ఆరుగ్యారెంటీ పథకాలే…కాంగ్రెస్ పార్టీకి విజయ అవకాశాలు.

ఆరుగ్యారెంటీ పథకాలే…కాంగ్రెస్ పార్టీకి విజయ అవకాశాలు.

తాండూరు అక్టోబర్ 16(జనంసాక్షి)
ఆరు గ్యారెంటీ పథకాలే…కాంగ్రెస్ పార్టీకి విజయ అవకాశాలు చేకుర్చుతాయని
జిల్లా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ యువనేత అమెర్ అబ్దుల్లా పేర్కొన్నారు.వికారాబాద్ జిల్లా పెద్ధేముల్ మండల యువకులతో రాబోయే ఎన్నికల పై సూదీర్గంగా చర్చించారు.ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ యువనేత అమెర్ అబ్దుల్లా మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకేల్లి పార్టీ బలోపేతానీకి యువతముందుకు రావాలన్నారు. నియోజకవర్గంలో ని ప్రతి ఇంటికి వెళ్లి పతకాపై అవగాహన కల్పించాలన్నారు. అదేవిధంగా నేటి యువత తలుచుకుంటే ఎదైనా సాదిస్తారని తెలిపారు. తాండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పవనగాలు విస్తున్నాయని వేల్లడించారు. మైనార్టీల తోనే
కాగెస్ కు ఆదరణ లభిస్తోందన్నారు. రాబోయే రోజుల్లో రాజకీయాల్లో మైనార్టీల పాత్ర కీలక మన్నారు.యువకులు కలిసి కట్టుగా కృషి చేసి కాంగ్రెస్ విజయానికి తోడ్పడాలన్నారు.
కాంగ్రెస్‌లో తాండూరు ఎమ్మెల్యే టిక్కెట్‌పై ఊహాగానాలు మైనార్టీలకు తెరలేపాయి. యువకులు తమ వెంటే ఉంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలోయువకులు ఆయుబ్ అక్రమ్, కిషన్ నాయక్ తో పాటు తదితరులు ఉన్నారు