ఆరు గ్యారంటీలతో అధికారంలోకి రావడం ఖాయం.

ఆరు గ్యారంటీలతో అధికారంలోకి రావడం ఖాయం.

జనంసాక్షి, రామగిరి : ఆరు గ్యారంటీ లతో రాబోయే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్, రామగిరి మండల పార్టీ అధ్యక్షులు రోడ్డ బాబు , మండల కన్వీనర్ పేరం మహేశ్వరరావు లు అన్నారు. మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు రామగిరి మండలం లద్నాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ విజయభేరి సభలో సోనియా గాంధీ  ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాల గురించి ఆదివారం కాంగ్రెస్ నాయకులతో కలిసి గడపగడపకు  తిరుగుతూ వివరించారు. తెలంగాణ బడుగు,బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని లద్నాపూర్ గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ సభలో ప్రకటించిన పథకాల గ్యారెంటీ కార్డులను పంపిణీ చేస్తూ ప్రజలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిసి సెల్ అధ్యక్షులు బండారి సదానందం, నియోజకవర్గ యూత్ అధ్యక్షులు బర్ల శ్రీనివాస్, నాగేపల్లి మాజీ సర్పంచ్ ఎరుకల ఓదెలు, గిరవేన రాములు, లద్నాపూర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు