ఆరేళ్ల చిన్నారి హత్య

చిత్తూరు,నవంబర్‌ 8 (జనం సాక్షి) : కొరబలపేట మండలం చేనేతనగర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన తల్లిదండ్రులతో కలిసి పెళ్లి వేడుకలకు వచ్చిన వర్షిత (6) అనే చిన్నారిని దుండగులు హత్య చేశారు. తల్లిదండ్రులతో కలిసి గురువారం రాత్రి పెళ్లి వేడుకలకు వచ్చిన వర్షిత అదృశ్యమైంది. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు వర్షిత కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో వర్షిత మృతదేహం
కల్యాణమండపానికి సవిూపంలో శుక్రవారం ఉదయం లభ్యమైంది. మృతురాలి స్వస్థలం బి.కొత్తపేట మండలం గుట్టపాలెం అని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం కోసం చిన్నారి వర్షిత మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.
వ్యక్తిని హత్య చేసి తగులబెట్టిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కడప జిల్లా /ూజంపేట ఎన్టీఆర్‌ విగ్రహం దగ్గర బస్‌ షెల్టర్‌లో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. హత్య చేసి తగులబెట్టినట్టు ఆనవాళ్లున్నాయి. మృతదేహం దాదాపు 50 శాతం మంటల్లో కాలిపోయింది.