ఆర్కేపీ ఓసీ లో మంజీర షావెల్ ప్రారంభం

ఆర్కేపీ ఓసీ లో మంజీర షావెల్ ప్రారంభం

రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : ఆర్కేపీ ఓసీ లో సోమవారం జనరల్ మేనేజర్ మందమర్రి జీ.ఎం.ఏ. మనోహర్ మంజీర షావెల్ ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ
ఈ యంత్రం యొక్క విలువ 48,17,733 రూపాయలు ఉంటుందని అన్నారు.
భద్రతా జాగ్రత్తలతో, మెషిన్ నిర్వహణను సక్రమంగా నిర్వహించాలని ఉద్యోగులకు సూచించారు. భద్రతతో నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలని ఉద్యోగులకు సూచించారు.
ఈ సంధర్భంగా ఆయన ఉద్యోగులకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమం లో ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎం. గోవిందరావు, మేనేజర్ వెంకటేశ్వర్లు, ఇంజినీర్ మహేందర్, ఇతర అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.