ఆర్టీఏ చెక్‌పోస్టులో ఏసీబీ తనిఖీలు

మెదక్‌జిల్లా : జహీరాబాద్‌ ఆర్టీఏ చెక్‌పోస్టులో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఎలాంటి రశీదులు లేని రూ. 42 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. సిబ్బందిపై కేసులు నమోదు చేశారు.