ఆర్టీసీ టికెట్ల కుంభకోణం కేసులో ఇద్దరి అరెస్టు

హైదరాబాద్‌(జనంసాక్షి): ఆర్టీసీ ఆన్‌లైన్‌ టికెట్ల కుంభకోణం కేసులో ఒకరిని సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు  ఆర్టీసీ మాజీ ఏజెంట్‌ హన్మంతరావు నుంచి రెండు కంప్యూటర్లు, రూ. 20వేల నగదు, సిమ్‌కార్డును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్టీసీ ఐపీ అడ్రస్‌, పాస్‌వర్డ్‌ దొంగిలించి హన్మంతరావు ఈ కుంభకోణానికి పాల్పడ్డారు.