ఆర్థిక ఇబ్బందులతో  వృద్ధ దంపతుల ఆత్మహత్య

జయశంకర్‌ భూపాలపల్లి,నవంబర్‌ 8 (జనం సాక్షి) : మహాదేవ్‌పూర్‌ మండలం ఎలికేశ్వరంలో శుక్రవారం ఉదయం విషాద ఘటన జరిగింది. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాల నేపథ్యంలో వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను రాళ్లబండి తాలయ్య(65), రాధమ్మ(60)గా గుర్తించారు. వీరు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. శవ పరీక్ష కోసం తాలయ్య, రాధమ్మ మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.