ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ

ఝరాసంగం ఆగస్టు 19 (జనంసాక్షి ) ఆజాదిక అమృత్ మహోత్సవం సంబరాలలో భాగంగా మండల కేంద్రం లోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఏ పి డి జయదేవ్ అధ్వర్యంలో రోగులకు వివిధ రకాల పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెడ్పీ సి ఈ ఓ ఎల్లయ్య, డి అర్ డి ఓ శ్రీనివాస్ లు హాజరై ఏ పి డి జయదేవ్ ను అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరారు. అనంతరం రోగులకు అన్నదానం చేశారు.జయదేవ్ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో వైద్య సిబ్బంది చేసిన సేవలు ఎనలేనివి అని వారిని కొనియాడారు.ఈ కార్యక్రమం లో ఎంపీడీఓ సుజాత తహశీల్దార్ తారా సింగ్, ఎస్ ఐ రాజేందర్ రెడ్డి, ఎంపి పి దేవదాస్,ఈ దుల పల్లి సర్పంచ్ బస్వరాజ్ పాటిల్, గుంత మార్పల్లి సర్పంచ్ మోహన్ రెడ్డి, బర్డిపుర్ ఎంపిటిసి రాజు,పంచాయతీ కార్యదర్శులు ఎపిఎం బాల కృష్ణ, ఏ పి ఓ రాజు కుమార్, తదితరులు పాల్గొనారు.