ఆ లేఖకు కట్టుబడి ఉన్నాం: మోత్కుపల్లి నరసింహులు
హైదరాబాద్,(జనంసాక్షి): గతంలో తాము తెలంగాణపై ప్రణబ్ ముఖర్జీ రాసిన లేఖకు తాము కట్టుబడి ఉన్నామని టీడీపీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నరసింహులు చెప్పారు. 12 ఏళ్లుగా కేసీఆరÊ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. నోట్లు, ఓట్లు, సీట్లు కోసమే కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్కు తెలంగాణ కావాలా? రాజకీయ పార్టీ కావాలా? అని ప్రశ్నించారు.