ఇంకుడు గుంతల అవగాహణ సదస్సు

హైదరాబాద్‌,(జనంసాక్షి): నగరంలో నీటి కొరతను ఎదుర్కొనేందుకు నగర మేయర్‌ జాగ్రత్త చర్యలు ప్రకటించారు. ఇవాళ ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో జరిగిన  ఇంకుడు గుంతల అవగాహనా సదస్సు మేయర్‌ మాజిద్‌ హుస్సేన్‌, డిప్యూటీ మేయర్‌ రాజ్‌కుమార్‌లు   పాల్గొని  మాట్లాడారు. జంట నగరాల్లో ఈ ఏడాది పదివేల ఇంకుడు గుంతలను నిర్మించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇందు కోసం రూ.6 కోట్లు కేటాయించామని తెలిపారు. తమ ప్రయత్నానికి ప్రజలు సహకరించాలని తయన విజ్ఞప్తి చేశారు.  ఇంకుడు గుంతల విషయంలో ఏమైనా అనుమానాలు, అపోహలుంటే అధికారుల్ని సంప్రతించాలని ఆయన కోరారు.

తాజావార్తలు