ఇంగ్లీష్ విూడియంతో డ్రాపవుట్స్
ఏలూరు,నవంబర్19(జనం సాక్షి): ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ విూడియం ప్రవేశపెడితే విద్యార్థుల అవగాహన చేసుకునే పరిస్థితి లేక డ్రాప్ అవుట్స్ పెరుగుతాయని ఫ్యాప్టో నాయకులు అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఇంగ్లీష్ విూడియం ప్రవేశపెడుతూ ప్రభుత్వం జారీ చేసిన జిఒ 81ను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇష్టారాజ్యంగా జిఒలు జారీ చేయడం సరికాదన్నారు.