ఇంజినీరింగ్‌, వృత్తివిద్య కోర్సుల్లో ప్రవేశాల్లో సవరణలు

హైదరాబాద్‌(జనంసాక్షి): ఇంజినీరింగ్‌, వృత్తివిద్య కోర్సుల్లో ప్రవేశాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం సవరణలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంజినీరింగ్‌, వృత్తి విద్యలో 85శాతం సీట్లు స్థానిక విద్యార్థులకే కేటాయించాలని నిర్ణయించింది.15 శాతం అన్‌రిజర్వ్‌డ్‌ కోటా సీట్ల కేటాయింపులో కొన్ని మార్పులు చేసింది. 15శాతం సీట్లకు 4 రకాల వారు అర్హులుగా గుర్తిస్తూ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ కోటాలో తెలంగాణ స్థానికులతో పాటు ఇతర రాష్ట్రాల్లో చదివిన వారు కూడా అర్హులని పేర్కొంది. ఇతర రాష్ట్రాల్లో చదవిన వారు తెలంగాణలో పదేళ్లు చదివి ఉండాలని నిబంధన పెట్టింది. కేంద్ర, రాష్ట్ర సంస్థల్లో పనిచేస్తోన్న వారి పిల్లలు, ఉద్యోగుల జీవిత భాగస్వాములు 15శాతం సీట్లకు అర్హులని తెలిపింది.