ఇంటర్ పాసైతే ల్యాప్’టాపే’!
ఎన్నికల వాగ్ధానం నిలబెట్టుకున్న అఖిలేశ్
లక్నో మార్చి 11 (జనంసాక్షి) :
ఇంటర్ పాసైతే ల్యాప్టాప్ ఇచ్చేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం (సమాజ్వాది) కొత్త పథకం ప్రవేశపట్టింది. సోమవారం లక్నోలో ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ జరిగిన ఓ కార్యక్రమంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన వాగ్ధానానికి అనుగుణంగా ల్యాప్టాప్లు పంపిణీ చేస్తున్నామన్నారు. సమాజ్వాది పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా చేసిన హామీలన్నీ ఏడాదిలోనే నెరవేర్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ పథకాన్ని రూపొందించినప్పుడు చాలా మంది వ్యతిరేకించారని తెలిపారు. గత ప్రభుత్వ తప్పుడు విధానాల వల్ల నిరు ద్యోగం పెరిగిపోయిందని, తమ ప్రభుత్వం పెట్టుబడులను పెంపొందింపజేసి ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించేందుకు ప్రయత్నిస్తుందని చెప్పారు.