ఇంటింట ప్రచారం చేపట్టిన సీపీఐ అభ్యర్ధి విజయబాయి
అండగా నిలుస్తున్న టీడీపీ
కారేపల్లి: సీపీఐ అభ్యర్ధి బానోత్ విజయబాయి ఆదివారం కారేపల్లి మండలంలో ఇంటింట ప్రచారాన్ని చేపట్టింది. కారేపల్లి, బీక్యాతండా, సూర్యాతండా, భాగ్యనగర్తండా, గుట్టకిందిగుంపు, అప్పాయిగూడెం గ్రామాల్లో పర్యటించిన ఆమె ఓట్లను అభ్యర్ధించారు. కారేపల్లిలో భారీ ర్యాలీ నిర్వహించారు. విజయబాయికి ఎదురేగి మహిళలు తిలకం దిద్ది హారతులు పట్టారు. పేదలసమస్యలు తెల్సిన వ్యక్తినని తనను గెలిపిస్తే అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను పరిష్కరిస్తామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనతో విసిగిపోయిన జనం మహాకూటమిని గెలిపించాలని నిర్ణయించుకున్నారన్నారు. గ్రామాల్లో తన ప్రచారానికి మంచి స్పందన లభిస్తుందని, ముఖ్యంగా మహిళలు తనను అక్కునచేర్చుకోని ఓటు భరోసా ఇస్తున్నారని తెలిపారు. మహాకూటమి పార్టీలు టీడీపీ, కాంగ్రెస్లు తనప్రచారంలో పాలుపంచుకుంటున్నాయన్నారు. ఇండిపెండెట్కు ఓటు వేయటం ద్వారా తమ ఓటును వృద్ధా చేసుకోవద్దని కోరారు. ఈకార్యక్రమంలో కారేేపల్లి మాజీ సర్పంచ్ మండెపూరి రాణి, సీపీఐ నాయకులు ఏపూరి బ్రహ్మం, ఎర్రబాబు, ఏపూరి లతా దేవి, వేల్పుల ధన్రాజ్, బోళ్లరామస్వామి, టీడీపీ నాయకులు మండెపూడి శ్రీనివాసరావు, కంచి రమేష్, పోలూరి రామారావు, కాసాని లక్ష్మినారాయణ, కడియాల రాజు, కాంగ్రెస్ నాయకులు తలారి చంద్రప్రకాశ్, రాంకిషోర్ తదితరులు పాల్గొన్నారు.