ఇందిరా వృద్ధాశ్రమంలో అన్నదానం

మునగాల, నవంబర్ 09(జనంసాక్షి): మునగాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామపంచాయతీలో ఉన్న ఇందిరా వృద్ధాశ్రమంలో బరాఖత్ గూడెం గ్రామానికి చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయులు  ఓరుగంటి రవి జన్మదిన సందర్భంగా బుధవారం ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బరాఖత్ గూడెం గ్రామ మాజీ సర్పంచ్ నరాల రుక్కారావు, సామాజిక ఉద్యమకారులు వేమూరి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇలా ప్రతి ఒక్కరు తమ తమ పుట్టినరోజులు వివాహ వార్షికోత్సవాలు ఇతరత్రా కార్యక్రమాలు ఇలా ఆశ్రమాలలో జరుపుకొని నినాదారణకు గురైన అనాధలకు మానసిక వికలాంగులకు చేయూతనివ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పందిరి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పందిరి నాగిరెడ్డి, గౌరవ సలహాదారులు ఎస్ఎస్ రావు, ఆశ్రమ నిర్వాహకురాలు నాగిరెడ్డి విజయమ్మ, శాఖమూడి సత్యనారాయణ, సూర్యాపేట జిల్లా సీనియర్ సిటిజన్ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.