ఇక రాష్ట్ర వ్యాప్తంగా రుణ మేళాలు

విజయవాడ,సెప్టెంబర్‌30  జనంసాక్షి  :  స్టేట్‌ లెవల్‌ బ్యాంకర్స్‌ కమిటీ (ఎస్‌ఎల్బీసీ) సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బ్యాంకర్స్‌కు సూచించిన ఆదేశాలను తప్పకుండా పాటిస్తామని ఎస్‌ఎల్బీసీ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం విజయవాడలో నిర్వహించిన విూడియా సమావేశంలో వారు మాట్లాడారు. ‘ప్రభుత్వం లబ్దిదారులకు బ్యాంకులో జమచేసే  డబ్బును బాకీ కింద జమకట్టుకోకుండా వాళ్ళకే ఇచ్చేస్తాము. రైతుల ఖాతాలో ప్రభుత్వం వేసే  వైస్సార్‌ రైతు భరోసా మొత్తం రైతులకే అందజేస్తాము. 2019-20 సంవత్సరంకు వ్యవసాయ రుణాలను 84 వేల కోట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాము. మొదటి మూడు నెలల్లోనే 61 శాతం రుణాలు రైతులకు మంజూరు చేశాము. ఖాతాదారులకు మరింత చేరువయ్యేందుకు అక్టోబర్‌ 3 తేదీ నుంచి 7 తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా రుణాల మేళాలు నిర్వహిస్తున్నాము. బ్యాంకుల విలీనం అనేది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం. విలీనాన్ని వ్యతిరేకించడం మా చేతుల్లో లేదు. కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం’ అని వెల్లడించారు.