ఇపిఎఫ్ వడ్డీలో కోత
న్యూఢిల్లీ,మే7(జనం సాక్షి):2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉద్యోగ భవిష్య నిధి(పీఎఫ్)పై వడ్డీరేటుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ సన్నద్ధమైంది. వడ్డీరేటు 8.55శాతంగా నిర్ణయించిన ఈపీఎఫ్వో ట్రస్టీల బోర్డు నిర్ణయానికి ఆర్థికశాఖ ఆమోదముద్ర వేసిందని సమాచారం. అయితే కర్నాటక ఎన్నికల నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో ఎన్నికల సంఘం అనుమతి కోరింది. కేంద్ర కార్మికశాఖ అధికారిక ప్రకటన వెలువరించనున్నది. ఈ వారంలోనే నోటిఫికేషన్ వెలువరించే అవకాశాలున్నాయని అధికారవర్గాలు అంటున్నాయి.దీంతో పీఎఫ్ ఖాతాలు కలిగిన 5కోట్ల మంది చందాదారులకు ఈ వడ్డీ మొత్తాన్ని జమ చేయనున్నారు.ఈపీఎఫ్ కోసం లావాదేవీల కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్(సీబీటీ) వడ్డీ రేట్లపై కేంద్ర ఆర్థిఖమంత్రిత్వశాఖకు నివేదించింది. దీని ఆధారంగానే కేంద్రకార్మికశాఖ నోటిఫికేషన్ వెల్లడించనున్నది.