ఈనెల 19న పద్మశాలి ప్రతిభా అవార్డ్స్

ఈనెల 19న పద్మశాలి ప్రతిభా అవార్డ్స్

కేసముద్రం అక్టోబర్ 14 జనం సాక్షి: శనివారం మండల పద్మశాలి భవనం నందు పోపా అధ్యక్షులు సామల నరసయ్య,కార్యదర్శి సామల వినోద్,ఉపాధ్యక్షులు తుమ్మ సురేష్,ట్రెజరర్ చల్ల వెంకటేష్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి మండల పద్మశాలి సంఘ అధ్యక్షుడు సామల నర్సయ్య హాజరైనారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2022-23 సంవత్సరంలో పద్మశాలి కుల బంధువులైన పిల్లలు వివిధ రంగాలలో ప్రతిభ కనపరిచిన వారిని సన్మానించే నేపథ్యంలో ఈ నెల 19 గురువారం ఉదయం 10 గంటలకు పద్మశాలి భవనం నందు నిర్వహిస్తున్నామని తెలియజేశారు.కేసముద్రం మండలంలో పద్మశాలీలైన పిల్లలు పదవ తరగతి,ఇంటర్మీడియట్,డిగ్రీ,ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో సీట్లు సాధించిన వారిని ప్రతిభా అవార్డ్స్ తో సన్మానించుకోవాల్సిన సందర్భంగా మండలంలో ఉండబడే వారిని ఈ క్రింది నెంబర్లకు ఫోన్ చేసి సంప్రదించగలరని కోరారు. 9959772462/9010984985/8522879345. ఈ కార్యక్రమంలో మండల పద్మశాలి సంఘ కోశాధికారి మామిడాల శ్రీనివాస్,పట్టణ యూత్ అధ్యక్షుడు చెలమల్ల కిరణ్,సంఘ భవన నిర్మాణ కన్వీనర్ సామల రమేష్,సామల శ్రీనివాస్, సామల లక్ష్మీనారాయణ,బత్తుల వీరన్న తదితరులు పాల్గొన్నారు.