ఉపాధి కూలీలు చెల్లించాలి

ఏలూరు,నవంబర్‌19(జనం సాక్షి): ఉపాధి హావిూ చట్టంలో పెండింగ్‌ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతూ మాజీ ఎంఎల్‌ఎ ముప్పిడి వెంకటేశ్వరరావు డిమాండ్‌ చేశారు. నియోజకవర్గంలోని టిడిపి నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎం.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నాలుగు నెలల నుంచి కూలీలు అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. బకాయిలను చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. గత ప్రభుత్వ కాలంలో ఉపాధి హావిూ పథకంలో చేసిన పనులకు సంబంధించిబిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరారు.