ఉస్మానియా జోలికొస్తే జాగ్రత్త: కాంగ్రెస్‌

2
హైదరాబాద్‌, ఆగస్ట్‌1(జనంసాక్షి):

ఉస్మానియా ఆస్పత్రిని కూల్చే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని లేదంటే ఉద్యమిస్తామని కాంగ్రెస్‌ నేతలు మల్లుభట్టి విక్రమార్క, దానం, వీహెచ్‌ హెచ్చరించారు. హెరిటేజ్‌ భవనాన్‌ఇన ఎలా కూలుస్తారని అన్నారు. దీనిని పునరుద్దరించాల్సింది పోయి కూల్చాలనుకోవడం సరికాదన్నారు.  శనివారం ఉస్మానియా ఆస్పత్రిని కాంగ్రెస్‌ బృందం  పరిశీలించింది. ఇక్కడి ఆస్పత్రి తరలింపుపై రోగులు ఇతర అధికారలుతో మాట్లాడారు. అనంతరం విూడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికే తలమానికమైన ఉస్మానియా ఆస్పత్రిని కూల్చేస్తామనడం బాధాకరమని అన్నారు. టెక్నికల్‌ కమిటీ సూచనలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఉస్మానియా పక్కనే ఉన్న 10 ఎకరాల ఖాళీ స్థలంలో సకల సౌకర్యాలతో ఆస్పత్రిని నిర్మించవచ్చని వారు సూచించారు. ఉస్మానియా ఆస్పత్రిని కూల్చే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని లేదంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు.