ఎంజీఎంలో నర్సుపై దాడి
`సిబ్బంది అందోళన
వరంగల్ : ఎంజీఎం అసుపత్రిలో విధుల్లో ఉన్న నర్సుపై ఓ దుండగుడు దాడికి దిగాడు. వెంటనే సిబ్బంది అతన్ని చితకబాది పోలీసులకు అప్పగించారు. అనంతరం నర్సులు తమకు రక్షణ కల్పించాలంటూ విధులు బహిష్కరించారు. అసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట వైద్యసిబ్బంది అందోళన చేపట్టారు.