ఎంపీల సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా రెండోరోజు కాంగ్రెస్‌ నిరసన

1q9vefifన్యూఢిల్లీ, ఆగస్టు 5 : లోక్‌సభ నుంచి 25 మంది ఎంపీల సస్పెన్షన్‌కు నిరసగా వరుసగా రెండో రోజు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్‌ పార్టీ నిరసనకు దిగింది. నల్లరిబ్బెన్లు కట్టుకున్న ఎంపీలు ధర్నాకు దిగి నిరసన చేపట్టారు. ధర్నాలో పార్టీ అధ్యక్షురాలు సోనియా, మాజీ ప్రధాని మన్మోహన్‌, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ సహా అందరూ పాల్గొన్నారు. కాంగ్రెస్‌ ఆందోళనలకు జేడీయూ, సీపీఐ పార్టీలు సంఘీభావం తెలిపాయి