ఎట్టకేలకు దాద్రిపై నోరు విప్పిన ప్రధాని

4

– దాద్రి ఘటన దురదృష్టకరం మోదీ

న్యూఢిల్లీ,అక్టోబర్‌14(జనంసాక్షి):

దాద్రీ ఘటనపై ఎట్టకేలకు ప్రధాని నరేంద్రమోడీ నోరు విప్పారు. దాద్రీ ఘటన దురదృష్టకరమన్నారు. దాద్రీ ఘటనలో కేంద్రం తప్పేముందని, ఆయన ప్రశ్నించారు. ఇలాంటి సందర్భాల్లో ప్రజలు సంయమనంతో ఉండాలన్నారు. ఎవరు కూడా ప్రతి విమర్శలకు దిగరాదన్నారు.  ఈ ఘటనలపై కేంద్రాన్ని తప్పుబట్టడం వెనుక తర్కమేంటని ప్రశ్నించారు. బీజేపీ సూడో సెక్యులరిజానికి వ్యతిరేకమని స్పష్టం చేశారు. దాద్రీలో ఆవు మాంసం తిన్నారన్న ఆరోపణలతో మహ్మద్‌ ఇఖ్లాక్‌ అనే వ్యక్తిని కొందరు వ్యక్తులు దారుణంగా కొట్టి చంపిన విషయం విదితమే. పాక్‌ గాయకుడు గులామ్‌ అలీ కార్యక్రమంపై నిషేధం విచారకరమన్నారు.