ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ ఆర్ డి ఓ కు ఫిర్యాదు ..చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ కమిటీ వినతి.

ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ ఆర్ డి ఓ కు ఫిర్యాదు ..చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ కమిటీ వినతి

రాజన్న సిరిసిల్ల బ్యూరో. అక్టోబర్ 21. (జనంసాక్షి). ఎన్నికల కోడ్ కు విరుద్ధంగా వ్యవహరించిన అధికార బిఆర్ఎస్ పార్టీ నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఆర్డిఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ ,వైద్య శివప్రసాద్ మాట్లాడుతూ సిరిసిల్లలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఎన్నికల కోడ్ కు విరుద్ధంగా కుల సంఘాల తీర్మానం చేయించడంపై అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. డబ్బులు మద్యం పంచకుండానే ఓట్లు అడుగుతానంటూ చెప్పిన కేటీఆర్ ఆశీర్వాద సభ సందర్భంగా కొందరు కౌన్సిలర్లు ప్రజలను తరలించడం కోసం బహిరంగంగా డబ్బులు పంచారని అన్నారు. ఈ విషయంలో సమగ్రంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఇచ్చిన వ్యక్తి పత్రం లో కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు బాలరాజు, కాంగ్రెస్ పార్టీ తంగళ్ళపల్లి అధ్యక్షులు టోనీ, కళ్యాణ చక్రవర్తి, గోనె ఎల్లప్ప, సత్యనారాయణ,మునిగల రాజు, భరత్, తదితరులు పాల్గొన్నారు