ఎఫ్‌డీఐలపై చర్చకు అనుమతినిచ్చిన స్పీకర్‌

ఢిల్లీ: ఎఫ్‌డీఐలపై లోక్‌సభలో చర్చించేందుకు స్పీకర్‌ మీరాకుమార్‌ అనుమతినిచ్చారు. 184వ నిబంధన కింది చర్చకు అనుమతిస్తున్నట్లు సభలో ప్రకటించారు. చర్చకు తేదీ, సమయం తర్వాత ప్రకటిస్తామని తెలియజేశారు. ఎఫ్‌డీఐలపై చర్చకు స్పీకర్‌ అనుమతినివ్వడాన్ని భాజపా స్వాగగతించింది.