ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ని కలిసిన అయ్యప్ప స్వామి మాలధారులు

మక్తల్ పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయానికి వెళ్లే రహదారి గుంతల మయంగా మారిందని అయ్యప్ప స్వామి మాలధారులు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ని కలిశారు.
మాలధారులు మాట్లాడుతూ
 అయ్యప్ప స్వామి దేవాలయానికి వెళ్లాలంటే భక్తులు మరియు మాలధారులు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని అన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని రోడ్డు వేయాలని కోరారు.
దీంతో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ సానుకూలంగా స్పందించి రోడ్డును పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరలోనే సిసి రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారు. దీంతో అయ్యప్ప మాలధారులు మరియు భక్త బృందం ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గురు స్వాములు అశోక్ గౌడ్, తాళంపల్లి అనిల్ కుమార్, శ్రీధర్ గౌడ్, నీల గౌడ్, కావలి ఆంజనేయులు, పూజ శంకర్ గురు స్వాములు, మరియు అయ్యప్ప మాలధారులు పాల్గొన్నారు