ఎర్రన్నాయుడి అంతిమయాత్ర ప్రారంభం

శ్రీకాకుళం: రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన తెదేపా సీనియర్‌ నేత  ఎర్రన్నాయుడి అంతిమయాత్ర ఆయన స్వగ్రామం నిమ్మాడలో ప్రారంభంమైంది. తమ ప్రియతమ నేతను కడసారి చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు, ప్రజలు నిమ్మాడకు తరలివచ్చారు. ఈ అందిమయాత్రలో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్‌తో పాటు పలువురు నేతలు పాల్గోన్నారు. నిమ్మాడలోని వ్యవసాయ క్షేత్రంలో 9.30కు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.