ఎస్సీ వర్గీకరణ చేయాల్సిందే

కాకినాడ,నవంబర్‌21 (జనం సాక్షి)  : ఎస్‌సి వర్గీకరణ డిమాండ్‌ను అమలు చేయాలని ఎంఆర్‌పిఎస్‌ డిమాండ్‌ చేసింది. ఎన్నికల హావిూని నిలబెట్టు కోవాలని, వర్గీకరణ కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలని ఎంఆర్‌పిఎస్‌ జిల్లా ఇన్‌ఛార్జి మందా వెంకటేశ్వరరావు అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హావిూని అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. అసంబ్లీ సమావేశాల్లో ఎస్‌సి వర్గీకరణకు ఏకగ్రీవంగా తీర్మానం చేయాలని డిమాండ్‌ చేశారు. ఉషా మెహరా కమిషన్‌ ఎస్‌సి వర్గీకరణ చేసేందుకు నివేదికను ఇప్పటికే సమర్పించిందన్నారు. ఆ నివేదిక ప్రకారం తక్షణం ఎస్‌సి వర్గీకరణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.