ఎస్సీ సెల్ మండల ప్రధానకార్యదర్శిగా రమేష్

నార్నూర్. (జనం సాక్షి)

నార్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా చునార్కర్ రమేష్ ను నియమించినట్లు ఆపార్టీ జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షులు లింగంపల్లి చంద్రయ్య తెలిపారు సోమవారం నియామక పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేయాలన్నారు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు బిరుదుల లాజర్ దూట రాజేశ్వర్ సయ్యద్ నిసార్ తదితరులు ఉన్నారు