ఏపీఆర్‌జేసీ హాల్‌ టికెట్లు జారీలో గందరగోళం

వరంగల్‌, జనంసాక్షి: ఏపీఆర్‌జేసీ ప్రవేశ పరీక్ష హాల్‌టిక్కెట్ల జారీలో గందరగోళం నెలకొంది. హన్మకొండ డాఫోడిల్‌ పాఠశాల పరీక్ష కేంద్రం పేరుతో జారీ అయిన హాల్‌ టిక్కెట్లలో ఒకే నంబర్‌ను ముగ్గురు అభ్యర్థులకు కేటాయించారు. ఈ కారణ:గా వారిని పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు.