ఏపీపీఎస్సీ సీమాంధ్ర పక్షపాతిగా మారింది :కేటీఆర్‌

హైదరాబాద్‌ : ఏపీపీఎస్సీ సీమాంధ్ర పక్షపాతిగా మారిపోయిందని తెరాస ఎమ్మెల్యే కేటీఆర్‌ అరోపించారు. ఉద్యోగ నియామకాల్లో రాష్ట్రపతి ఉత్తర్వులు, జోనల్‌ విధానాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. దళితులకు తెరాసపై నమ్మకం లేకపోతే వివేక్‌, మందా, కడియంలాంటి నేతలు పార్టీలో చేరేవారా? అని ప్రశ్నించారు