ఐఎస్‌ఐఎస్‌ చీఫ్‌ అబూబకర్‌ అల్‌బాగ్దాదీ మృతి

3

– ధృవీకరించిన అమెరికా

టెహ్రాన్‌,ఏప్రిల్‌27(జనంసాక్షి):

అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌ చీఫ్‌ అబూబకర్‌ అల్‌ బాగ్దాదీ మరణించాడు. అతడి మృతిని ఇరాన్‌ రేడియో ధ్రువీకరించింది. ఇటీవ లే అమెరికా సైన్యాలు వైమానిక మార్గంలో చేస ిన క్షిపణి దాడిలో అల్‌ బాగ్దాదీ తీవ్రంగా గాయ పడ్డాడు. సిరియా సరిహద్దుల్లోని అల్బాజ్‌  జిల్లా నైన్వేలో కురిపించిన బాంబుల వర్షంలో బాగ్దా దీకి గాయాలయ్యాయి. ఆ గాయంతో బాధపడు తూనే బాగ్దాదీ మరణించినట్లు ఇరాన్‌ రేడియో స్పష్టం చేసింది. కాగా బాగ్దాదీ తలకు ఇప్పటికే అమెరికా రూ. 65 కోట్ల వెల కట్టింది. గత జూ లై నెలలో చివరి సారిగా బాగ్దాద్‌లోని ఓ మసీ దులో బాగ్దాదీ ప్రసంగించాడు. ఆ తర్వాత ఎప్పు డూ బయట కనిపించలేదు. కాగా, పాశ్చాత్య దేశాలను వణికిస్తున్న ఐఎస్‌ఐఎస్‌కు  బాగ్దాదీ మరణం పెద్ద దెబ్బ అవుతుంది. అనేకమందిని పీకలు కోసేసి హతమార్చి, ఆ వీడియోలను సై తం ఆన్‌లైన్‌లో పోస్ట్‌ చేసి భయానక వాతావర ణాన్ని ఐఎస్‌ఐఎస్‌ సృష్టించిన విషయం తెలిసిం దే. ఇస్లామిక్‌ రాజ్యం అన్న నినాదాన్ని బలంగా జనంలోకి తీసుకెళ్లి, ఐఎస్‌ఐఎస్‌ను అల్‌ బాగ్దాదీ స్థాపించాడు. అలాగే ఐఎస్‌ఐఎస్ను టెర్రరిస్టు గ్రూపుగా మార్చడంలో కూడా అల్‌ బాగ్దాదీ కీల కపాత్ర పోషించాడు. అత్యంత కిరాతకంగా హత్యలు చేయాలంటూ

తన ‘సైన్యాన్ని’ ఆదేశించి అగ్రరాజ్యాలను వణికించాడు. ఇప్పటికే ఎందరో విదేశీయులతో పాటు ఇస్లామేతరులను కిరాతకంగా హ్యత చేయించాడు. అయితే.. అమెరికా మాత్రం బాగ్దాదీ మరణించిన విషయాన్ని తాము నమ్మేది లేదని చెబుతోంది. అతడి మృతదేహాన్ని చూసేవరకు ఈ కథనాలను విశ్వసించబోమని పెంటగాన్‌ తెలిపింది. గతంలో కూడా ఇలాంటి వదంతులతో తమ దృష్టిని మళ్లించారని చెప్పింది.