ఐసిడిఎస్ కొల్లాపూర్ ఆధ్వర్యంలో పిల్లలకు అక్షరాభ్యాసం చేయించిన సిడిపిఓ వెంకటరమణ

కోడేరు (జనం సాక్షి) జూన్ 15 కోడేరు మండల పరిధిలోని సింగాయిపల్లి, లో గల రాజాపూర్, సింగాయిపల్లి,గ్రామాల అంగన్ వాడి సెంటర్ల లో పిల్లలకు ఐసిడిఎస్ కొల్లాపూర్ సిడిపిఒ వెంకటరమణ  జ్యోతి ప్రజ్వలన చేసి అక్షరాభ్యాసం  చేయించారు.అదేవిధంగా సూపర్ వైజర్ శోభారాణి పాల్గొన్నారు.అనంతరం గర్భవతులకు, బాలింతలకు ఇమ్యనిటి ని పెంచుకోవడానికి అంగన్వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేసిన పౌష్టికాహారాన్ని తప్పక తీసుకోవాలని వారికి సూచించారు.అదేవిధంగా గర్భవతులు బాలింతలు తరుచుగా ఆరోగ్య పరిక్షలు చేయించుకోవాలని సిడిపిఒ తెలిపారు.అదేవిధఝగా
ఐసిడిఎస్ అంగన్ వాడి సెంటర్ల కి మీ పిల్లలను తప్పకుండా పంపాలని తల్లులకు సూచించారు.అంతరం  కొల్లాపూర్ సిడిపిఒ వెంకటరమణ, కోడేరు ఐసిడిఎస్ సూపర్వైజర్ శోభారాణి,పిల్లలు,తల్లులతో కలిసి భోజనాలు చేశారు.ఈ కార్యక్రమంలో సిడిపిఒ వెంకటరమణ,  కోడేరు ఐసిడిఎస్ సూపర్వైజర్ శోభారాణి, పిల్లలు తల్లులు గర్భవతులు, ఐసిడిఎస్ అధికారులు శివ, శారద, అంగన్వాడీ టీచర్స్ సి,అంజనమ్మ,సి అరుణ,సి సౌజన్య, తదీతరు పాల్గొన్నారు.