ఒడిశా హక్కుల నేత దండెపాణి మొహంతి అరెస్టు
వెంటనే విడుదల చేయాలి
వీవీ, హరగోపాల్
బరంపుర,జనంసాక్షి :
ఒడిశాలో పౌర హక్కుల కోసం అహర్నిశలు పోరాడుతున్న హక్కుల నేత దండపాణి మహంతిని పోలీసులు అరెస్టు చేశారు. మహంతిని శుక్రవారం బరంపుర పోలీసులు అరెస్టు చేశారు. మావోయిస్టులు మల్కనగిరి కలెక్టర్ను అలాగే ఇటలీ టూరిస్టులను కిడ్నాప్ చేసినప్పుడు రాజకీయ పార్టీల నేతలను ప్రభుత్వం అరెస్టు చేసినప్పుడు దండపాణి మహంతి చర్చల్లో మధ్యవర్తిగా కీలిక భూమిక పోషించారు. హక్కుల నేత మహంతిని చట్టవిరుద్ధంగా అరెస్టు చేశారని పౌర హక్కుల నేతలు ఆరోపించారు. ఆయనను బేషరతుగా విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల నేతలు వరవరరావు, ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు