ఒలింపిక్స్‌లో మరో పతకం ఖాయం

మేరీ కోమ్‌ సంచలనం
లండన్‌: భారతక్రీడాకారిణి మేరీకోమ్‌ లండన్‌ ఒలింపిక్స్‌ లో సంచలనం సృష్టించింది.భారతదేశానికి మ రోపతకాన్ని ఖాయంచేసింది.బాక్సింగ్‌ మహిళ ప్లై 51కెజీలకెటగిరీలో ఆమెసెమీఫైనల్‌కు చేరుకుం ది.సోమావారం జరిగిన లండన్‌ఒలింపిక్స్‌ పోట ీల్లో ఆమె ఈ విజయం సాధించింది.మేరీకోమ్‌ టూనీషియాకు చెందిన మరోవా రహాలీని 15-6 స్కోరుతో క్వార్టర్‌ ఫైనల్లో ఓడించింది.మేరీ కోమ్‌ విజయంతో బాక్సింగ్‌విభాగంలోఖాతా తెరుచుకు ంది. సెమీఫైనల్లో ఓడిపోయినఇద్దరు క్రీడాకురు లకు కూడా కాంస్యపతకం ప్రదానంచేస్తారు. దీంతో మేరీకోమ్‌కు పతకంఖాయమైనట్లే, అయి తే, ఆమె స్వర్ణ పతకం సాధించినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.29ఏళ్ల మేరీకోమ్‌ తన ప్రత్య ర్థిపై పూర్తిగా పైచేయి సాధించింది.నాలుగు రౌం డ్లలో ఆమె 2,3,6,4 పాయింట్లు సాధించగా, ర హాలీ1,2,2పాయింట్లసాధించింది.ఒలింపిక్స్‌లో పతకం సాధించిన మూడో భారత మహిళగా మేరీకామ్‌ రికార్డు నమోదుచేయనుంది. ఇంతకు ముందు కరణంమల్లీశ్వరి 2000లోసిడ్నీలో కాం స్యపతకం సాధించింది. సైనానెహ్వాల్‌ ఈ ఒలిం పిక్స్‌లో బ్యాడ్మింటన్‌లో కాంస్యపతకం సాధించిం ది.విజయం ఉద్వేగపూరిత క్షణమని, తన కవల కుమారుల పుట్టునరోజు ఈ విజయం దక్కిందని మేరీకోమ్‌ ఆనందం వ్యక్తంచేసింది.పోలిష్‌ బాలి క చాలా బలమైందని, అయితే సాంకేతికంగా కా స్తా బలహీనురాలని, సాంకేతికంగా బాగుంటే ఆ మెను ఎవరూఓడించలేరని,తనఅనుభవం వల్లనే ఆమెను ఓడించానని మేరీకోమ్‌ అన్నది.
బాక్సింగ్‌లో ఇదిఇండియా గొప్పరోజు అని, అ ద్భుతమైన పాదాలకదలికతో తెలివిగా మేరీకోమ్‌ వ్యవహరించిందని, స్కోర్‌చేస్తూ కదలిందని భారత్‌ కోచ్‌ గుర్‌భక్ష్‌ సింగ్‌ చెప్పారు.