ఓటరుగా నమోదు చేసుకోండి

భద్రాద్రి కొత్తగూడెం,జనవరి30(జ‌నంసాక్షి): ప్రతీ ఒక్కరు ప్రజాస్వామ్యంలో భాగస్వాములు కావాలంటే ఓటరుగా నమోదు చేయించుకోవాలని భద్రాచలం ఐటీడీఏ పీవో పమేలా సత్పతి అన్నారు. ఇందుకు ఎన్‌ఇకల సంఘం ఇచ్చిన అవకాశాన్‌ఇన సద్వినియోగం చేసుకుని ఓటరుగా నమోదు కావాలన్నారు. 2018 డిసెంబర్‌31 నాటికి 18 సంవత్సరాలు నిండిన పౌరులందరు ఓటు హక్కు పొందడానికి అర్హులని తెలిపారు. ఓటరు లిస్ట్‌ పేరు లేకపోతే ఓటు వేయలేరని, ఓటర్ల జాబితా సవరణ జనవరి నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 4వ తేదీ వరకు కొనసాగుతుందని, తుది జాబితా ఫిబ్రవరి26న ప్రకటిస్తారని తెలిపారు.