కన్నడ సాహితీవేత్త మల్లేశప్ప దారుణ హత్య

1

కర్నాటక,హైదరాబాద్‌,ఆగస్టు 30, (జనంసాక్షి) ప్రముఖ కన్నడ సాహితీవేత్త, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా జనంలో చైతన్యానికి విశేష కృషి చేసిన మల్లేషప్ప ఎం.కల్‌బుర్గి దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు తుపాకీతో ఆయనను కాల్చి చంపారు. ధర్వాడ్‌ లోని ఆయన నివాసంలో ఈ ఘటన జరిగింది. 2006లో కేంద్ర సాహిత్య పురస్కారం అందుకున్న మల్లేషప్ప.. గతంలో హంపీ యూనివర్సిటీకి వైస్‌ ఛాన్స్‌ లర్‌ గా కూడా పనిచేశారు. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా జనలను చైతన్యవంతులను చేసేందుకు ఆయన కృషిచేశారు. మల్లేషప్ప హత్యపై సాహితీ ప్రియులు బెంగళూరులో ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై విచారణ జరిపి…దోషులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్‌ చేశారు.