కరీంనగర్ లో జర్నలిస్టులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి…అధికారులకు వినతి పత్రం.

రాజన్న సిరిసిల్లబ్యూరో. అక్టోబర్ 19.(జనంసాక్షి). కరీంనగర్‌లో జర్నలిస్టులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరుతూ అధికారులకు పలువురు జర్నలిస్టులు వినతి పత్రం అందజేశారు. గురువారం అధికారులకు అందజేసిన వినతిపత్రంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలో సీనియర్ పాత్రికేయులపై ఎన్నికల కోడ్ నిబంధనలు ఉల్లంఘించారని వివిధ సెక్షన్ల కింద అక్రమంగా కేసులు నమోదు చేయడం జరిగిందని అధికారులకు ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నారు. తక్షణమే జర్నలిస్టులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని పత్రిక స్వేచ్ఛకు భంగం కలగకుండా చూడాలని అధికారులకు ఇచ్చిన వినతి పత్రం కోరారు. అధికారులను కలిసిన వాళ్ళు జర్నలిస్టు ఆల్లె రమేష్, నుగురి మహేష్,ఉల్లెందుల మల్లేశం, ఎలగందుల నగేష్, సావనపెళ్లి గణేష్, పొన్నం చందు పాల్గొన్నారు.