కరోనా కన్నా డేంజర్‌ కాంగ్రెస్‌

రైతన్నలు కాంగ్రెస్‌ కుట్రలను గమనించాలి
ఆ పార్టీని నమ్మితే నట్టేట మునగడం ఖాయం
రైతుబంధు వద్దని లేఖ రాయడం కాంగ్రెస్‌ అనైతికతకు నిదర్శనం : మంత్రి నిరంజన్‌ రెడ్డి
హైదరాబాద్‌, అక్టోబర్‌ 25 (జనంసాక్షి):అధికారం కోసం కర్ణాటకలో అడ్డగోలు హావిూలు ఇచ్చి ఆరు నెలలు కాకముందే కాంగ్రెస్‌ చేతులు ఎత్తేసిందని, ఇప్పుడు రైతుబంధు వద్దని లేఖ రాయడం కాంగ్రెస్‌ అనైతికతకు నిదర్శనమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి విమర్శించారు. రైతుబంధు పంపిణీ చేయొద్దని ఏఐసీసీ ఇంచార్జ్‌ మాణిక్‌ రావు ఠాక్రే లేఖ రాయడంపై ఒక ప్రకటనలో స్పందించారు. అంతపెద్ద కరోనా విపత్తులోనూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎంతో ఉన్నతంగా ఆలోచించి రైతుబంధు ఆగనివ్వలేదని గుర్తు చేశారు. కరోనా దెబ్బకు ప్రపంచం విలవిల్లాడుతున్నా తెలంగాణలో ఏడు వేల పైచిలుకు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొన్నట్టు తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ కేవలం ఎన్నికల కోసం ఆన్‌ గోయింగ్‌ పథకాన్ని ఆపాలంటూ ఏఐసీసీ ఇంఛార్జి మాణిక్‌ రావు ఠాక్రే ద్వారా ఎన్నికల సంఘానికి లేఖ రాసి తన నిజ స్వరూపాన్ని బయటపెట్టుకుందన్నారు. అధికారం విూద తప్ప కాంగ్రెస్‌ పార్టీకి రైతుల విూద గానీ, వ్యవసాయం విూద గానీ ప్రేమ లేదని పేర్కొన్నారు. నాడు కాంగ్రెస్‌ పాలనలో ఎరువుల కోసం లాఠీ దెబ్బలు తిన్నాం.. కరువుతో అల్లాడి అంబలి కేంద్రాల కోసం ఎదురుచూశాం.. పచ్చగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్‌ పాలనలో ఆకలిచావులు, ఆత్మహత్యలు, కరెంట్‌ కోతలు, వలసలకు నిలయమైందని మంత్రి గుర్తు చేశారు.