కర్ణాటకలో మరోసారి భాజపా నేతల సమావేశం

బెంగళూరు: ఈరోజు ఉదయం జరగాల్సిన భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్షం సమావేశం రద్దు కావడంతో భాజపా నేతలు ఈరోజు సాయంత్రం మరోసారి భేటీ అయ్యారు. రాష్ట్రంలో అధికారాన్ని గౌడ నుంచి శెట్టర్‌కు బదలాయించే ప్రక్రియలో గౌడ మద్దతుదారలు ఎదురుతిరిగారు. వారిలో 50 మంది ఉదయం సమావేశానికి హాజరుకాలేదు. దాంతో రాష్ట్రంలో నాయకత్వ సంక్షోభం కొనసాగుతోంది.