కర్నాటక నుంచే మోడీకి పతనం
జెడిఎస్ తరపున ప్రచారం చేస్తానన్న మాయావతి
బెంగళూరు,మే7(జనం సాక్షి): కర్నాటక నుంచే మోడీ పతనం తప్పదని బిఎస్పీ అధినేత్రని మాయావతి అన్నారు. అక్కడ ఓటమి బిజెపికి గుణపాఠం కాబోతున్నదని అన్నారు. కేంద్రంపై ఆధిపత్యాన్ని చూపే అవకాశం తమకు కర్ణాటక నుంచే లభించగలదని బిఎస్పి అధినేత మాయావతి ఆశాభావం వ్యక్తం చేశారు. జాతీయ ఛాన్లకు ఆమె ఇచ్చిన ఇంటూర్య్యూలో మె మాట్లాడుతూ కర్ణాటకలో దేవెగౌడ నేతృత్వంలోని జెడి(ఎస్) తరఫున ప్రచారం చేసేందుకు తాను వెళ్లనున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికల్లో తాము సమాజ్వాది పార్టీతో పొత్తు పెట్టుకునే అంశంపై అధికారికంగా ప్రకటన విడుదల చేస్తామని, ఈ విషయంలో చర్చలు సాగుతున్నాయని తెలిపారు. రెండు పార్టీల సమన్వయంతో సీట్ల పంపకంపై నిర్ణయం తీసుకున్నాక ప్రకటన విడుదల చేస్తామన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున ఈ విషయంలో తొందరపడాలని భావించడం లేదని ఆమె పేర్కొన్నారు. ఇటీవల యుపిలో రెండు లోక్సభ స్థానాల ఎన్నికల్లో అధికార బిజెపిని నిలువరించగల్గినట్టే, ఆ పార్టీపై బిజెపి, ఎస్పి పొత్తుతో విజయం
సాధించగలమని ఆమె ధీమాను వ్యక్తం చేశారు.