*కల్తీ మద్యం పై మద్యం దుకాణాలలో ఎక్సైజ్ శాఖ తనిఖీలు*

పెబ్బేరు ఆగస్టు 29 ( జనంసాక్షి ): కొద్ది రోజుల క్రితం పెబ్బేరులో ఓ మద్యం దుకాణం లో  మద్యం సీసా లలో కల్తీ బయట పడిన ఘటనతో ఉలిక్కిపడిన ఎక్సైజ్ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. వనపర్తి జిల్లా ఎక్సైజ్ శాఖాధికారి వినయ్ కుమార్ ప్రభు ఆదేశాల తో జిల్లాలోని మద్యం దుకాణాలలో తనిఖీలు చేపట్టారు. మద్యం తనిఖీల్లో భాగంగా  కొత్తకోట ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ బృందం పెబ్బేరు లో ఉన్న మద్యం దుకాణాలలో మద్యం సీసాలనుండి మద్యాన్ని సేకరించి అక్కడే దుకాణ యజమాని ముందే పరీక్షలు నిర్వహించారు.తనిఖీ చేసిన దుకాణాలలో అలాంటి మద్యం కల్తీ జరగలేదని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ తెలిపారు.