కళ్లెపు సత్యవతి చిత్రపటానికి ఘన నివాళులు అర్పించిన

మండల అధ్యక్షుడు నున్నా రమణ

డోర్నకల్ ఆగస్టు-29 (జనం సాక్షి న్యూస్)

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం గొల్లచర్ల గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు కళ్లెపు సతీష్ కుమార్ గౌడ్ తల్లి కళ్లెపు సత్యమ్మ గౌడ్ ఇటీవలే అనారోగ్యంతో స్వర్గస్తులు అయ్యారు. గొల్లచర్ల గ్రామంలో సోమవారం స్వర్గీయులు కళ్లెపు సత్యవతి దశదినకర్మ కార్యక్రమానికి హాజరై నివాళులు అర్పించిన టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నున్న రమణ,సొసైటీ చైర్మన్ చేరెడ్డి బిక్షం రెడ్డి,ఎంపీటీసీ నున్న మల్లికార్జున్, డోర్నకల్ మున్సిపల్ కౌన్సిలర్ పోటు జనార్ధన్, లాయర్ రమేష్, కొత్త రాంబాబు,టీచర్ నాయకులు బానోత్ మంగీలాల్, గూగులోత్ శంకర్ నాయక్, బోడ రమేష్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ బానోత్ అర్జున్ ,ఎంపీటీసీ శంకర్ కోటి,గొల్లచర్ల సర్పంచ్ చేరెడ్డి సమ్మి రెడ్డి,టిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు మేకపోతుల శ్రీనివాస్ గౌడ్,కొత్త దుబ్బ తండా సర్పంచ్ అజ్మీర లెనిన్ కుమార్,రాష్ట్ర నాయకులు రేగళ్ల సతీష్ రెడ్డి,ఐల వెంకన్న,మేకపోతుల రమణ, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు వివిధ పార్టీల నాయకులు, ముఖ్య కార్యకర్తలు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొని వారి కుటుంబాన్ని పరామర్శించి,కళ్లెపు సత్యమ్మ ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఘన నివాళులర్పించారు. ఈ దశదిశ కర్మ కార్యక్రమానికి సుమారు 5000 మంది జనాభా రావడంతో జనసంద్రంగా మారిన గొల్లచర్ల గ్రామ పరిధిలోని శ్రీ సాయి రెడ్డి ఫంక్షన్ హాల్.