కశ్మీర్లో కర్ఫ్యూ ఎత్తివేత
శ్రీనగర్ : గత కొద్దిరోజులుగా కశ్మీర్లో నెలకొన్న అల్లకల్లోలానికి తెరపడింది. కశ్మీర్లోయలో కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్లు మంగళవారం జమ్ముకశ్మీర్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇజ్బుల్ కమాండర్ బుర్హాన్వనీ ఎన్కౌంటర్ సందర్భంగా గత 17 రోజులుగా కర్ఫ్యూ కొనసాగుతున్న విషయం తెలిసిందే.