కాంగ్రెస్ పార్టీలో చేరిన ముస్త్యాల మాజీ సర్పంచ్

జనంసాక్షి, రామగిరి, అక్టోబర్ 28 : పెద్దపల్లి జిల్లా మంథని నియోజక వర్గం పరిధిలోని రామగిరి మండలం మాజీ సర్పంచ్ నడిపల్లి కళారాణి రాజేశ్వరరావు శనివారం మేనిఫెస్టో కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి శ్రీధర్ బాబు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు నడిపెల్లి రాజేశ్వరరావు, సుందిళ్ల మాజీ ఎంపీటీసీ ఊట్ల గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.