కాశ్మీర్లో హోరాహోరీ ఎన్కౌంటర్
– ముగ్గురు మిలిటెంట్ల హతం
– ఒకరి పట్టివేత
శ్రీనగర్, ఆగష్టు 27 (జనంసాక్షి):
జమ్ముకాశ్మీర్లో మరో పాక్ ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నారు. రాఫియాబాద్లో అక్రమంగా చొరబడిన ఉగ్రవాదులను పట్టుకోవడానికి ¬రా¬రీ కాల్పులు జరిగాయి. ఇటీవలే ఉధంపూర్లో ఉస్మాన్ అలియాస్ నవేద్ను స్థానికుల సాయంతో పోలీసులు అరెస్ట్ చేయగలిగారు. మరో ఉగ్రవాదిని సజీవంగా పట్టుకోవడంతో పాకిస్థాన్కు వ్యతిరేకంగా మరో కీలక ఆధారం దొరికినట్లైంది. పట్టుబడిన ఉగ్రవాది పేరు సజ్జద్ అహ్మద్అని తెలిసింది. లష్కర్ ఎ తొయిబా ఉగ్రవాదైన సజ్జద్ ముజఫర్గఢ్ ప్రాంతానికి చెందిన వాడు. వరుస బెట్టి ఉగ్రవాదులను భారత్పైకి దండయాత్రకు పంపిస్తోన్న పాకిస్థాన్ దుష్ట చర్యలను ప్రపంచం ముందుంచడానికి మరో సజీవ సాక్ష్యం లభించినట్లైంది. రాఫియాబాద్లో జరిగిన ఎన్కౌంటర్లో మరో ముగ్గురు ఉగ్రవాదులు కూడా చనిపోయారు.
జమ్ముకశ్మీరులోని సోపోర్ జిల్లాలో భద్రతా బలగాలు జరిపిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. స్థానిక విజి ప్రాంతంలో ఐదుగురు ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు సమాచారం అందడంతో భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో మరో ఉగ్రవాదిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. అదుపులోకి తీసుకున్న ఉగ్రవాది సజ్జద్ అహ్మద్ ను బలగాలు ప్రశ్నిస్తున్నాయి.